హనుమకొండ చౌరస్తా, జనవరి 4 : పట్టుదల, క్రమశిక్షణ, ఆకుంఠిత దీక్షతో యువలోకం విజయతీరాలను చేరుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. పిలుపునిచ్చారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హ్యాండ్బాల్ కోర్టులో బుధవారం యువజనోత్సవాలను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఓటమి గెలుపునకు తొలిమెట్టని, ఓటమి చెందినా కుంగిపోకుండా విజయం వైపు అడుగులు వేయాలని కోరారు. త్వరలోనే యువకులు, యువజన సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి చైతన్యాన్ని తీసుకొస్తానని వినయ్భాస్కర్ అన్నారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఆయన సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.
హనుమకొండ చౌరస్తా, జనవరి 4: ఓడిన చోటే గెలుపు సూత్రాలను నేర్చుకుని, విజయాన్ని ముద్దాడాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హ్యాండ్బాల్ కోర్టులో బుధవారం యువజనోత్సవ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో జానపద గీతాలు, జానపద నృత్యాల్లో విద్యార్థులు పాల్గొని ప్రతిభకనబర్చారు. ముఖ్యఅతిథిగా చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసిన యువజనోత్సవాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు యువజన, క్రీడల శాఖమంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువజనోత్సవాల వేదిక ద్వారా ప్రతిభకు పదును పెట్టి ఉన్నతస్థాయిలో రాణించాలని కోరారు.
పట్టుదల, క్రమశిక్షణ, ఆకుంఠిత దీక్షతో యువలోకం విజయతీరాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. యువశక్తి చాలా ప్రాముఖ్యమైందని, యువకులు సన్మార్గంలో ముందుకు సాగాలన్నారు. ఓటమి గెలుపునకు తొలిమెట్టని, ఒకవేళ ఓటమి చెందినా కుంగిపోకుండా విజయం వైపు అడుగులు వేయాలని కోరారు. త్వరలోనే యువకులు, యువజన సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి చైతన్యాన్ని తీసుకొస్తానని వినయ్భాస్కర్ అన్నారు. డీవైఎస్వో గుగులోత్ అశోక్కుమార్నాయక్ మాట్లాడుతూ యువకుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు యువజనోత్సవాలు దోహదపడుతాయన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చినవారికి వినయ్భాస్కర్ సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, వరంగల్ జిల్లా యువజన క్రీడల అధికారి ఎస్ ఇందిర, అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, ఏవీవీ జూనియర్ కాలేజీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, కందుల సృజన్, నరేశ్, డీఎస్ఏ కోచ్లు పాల్గొన్నారు.