హనుమకొండ, ఆగస్టు 22 : ఉద్యోగులతో తనకు విడదీయలేని ఆత్మీయ అనుబంధం అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని టీఎన్జీవో భవన్లో ఉద్యోగులను చీఫ్ విప్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో చీఫ్ విప్ను స్వాగతించి, ఘనంగా సన్మానించారు. అనంతరం చీఫ్ విప్ మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో ఉన్నారని, వారందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిషారం కోసం నిత్యం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై తనకు సంపూర్ణమైన అవగాహన ఉందన్నారు. ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ తదితర సమస్యలను త్వరలో సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారన్నారు. టీఎన్జీవోలు మొదటి నుంచి తమ కుటుంబానికి అండగా ఉన్నారన్నారు. ఇక ముందు కూడా అలాగే ఉండాలని చీఫ్ విప్ కోరారు. జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ దాస్యం వినయ్ భాసర్ ఉద్యోగులకు నిత్యం అందుబాటులో ఉంటూ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. భవిష్యత్తులో వారు ఇంకా ఉన్నత పదవులను అధిరోహించాలని యూనియన్ పక్షాన కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, కోశాధికారి పనికల రాజేశ్, కేంద్ర సంఘం నాయకులు శనిగరపు శ్యామ్ సుందర్, కత్తి రమేశ్, భూక్యా రాము నాయక్, మొయిజ్, లక్ష్మీప్రసాద్, పెన్షనర్ల సంఘం జిల్లా బాధ్యులు సర్వర్ హుస్సేన్, గోవర్ధన్, నాలుగోతరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దాస్య నాయక్, జిల్లా నాయకులు సలీం, చీకటి శ్రీనివాస్, రాజమౌళి, కుమారస్వామి, సురేష్, రాజేష్ ఖన్నా,యమునా పాల్గొన్నారు. కాగా, అంతకు ముందు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చీఫ్విప్ను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు.
కాజీపేట : త్వరలో జరుగనున్న ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు సైనికులా పని చేయాలని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కోరారు. వినయ్భాస్కర్కు పశ్చిమ ఎమ్మెల్యే టికెట్ కేటా యించినందున కాజీపేట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమవారం ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. శాలువా తో సన్మానించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ నియోజక వర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ఇంటింటికీ వెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించాలన్నారు. ఆపదలోఉన్నవారికి రాజకీయాలకతీతంగా ఆదుకున్న విషయాలను గుర్తుచేశారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరించి మూడోసారి బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచేలా కృషి చేయాలన్నారు. చీఫ్విప్ను కలిసిన వారిలో సీనియర్ నాయకులు సిరిల్ లారెన్స్, మర్యాల కృష్ణ, సిలువేరు విజయ్భాస్కర్, మైలారం శంకర్, మతిన్, పప్పుల గోవర్ధన్, జెరిపోతుల వెంకన్న, పోతుల సాంబయ్య, శ్రీనివాస్, రాజ్కుమార్, శ్రీకాంత్, సల్లూరి నాగేశ్, నర్సింగరావు ఉన్నారు.
హనుమకొండ సిటీ బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ అభ్యర్థిగా దాస్యం వినయ్భాస్కర్ ఐదోసారి పోటీ చేస్తున్నందున ఆయనను 4వ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో చీఫ్విప్ను డివిజన్ అధ్యక్షుడు కంజర్ల మనోజ్ ఆధ్వర్యంలో కలిసి శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సన్మానించారు. వినయ్భాస్కర్ను కలిసిన వారిలో నాయకులు బైరపాక ప్రశాంత్, పేర్ల మనోహర్, తీగల భాగ్య, వీర రఘువీర్, మేకల కిరణ్, పల్లె జయపాల్, అచ్చుకట్ల రమేశ్, లక్ష్మి, సిలువేరు పార్వతి, ఇస్మాయిల్, రాణి పాల్గొన్నారు.
న్యూశాయంపేట : మరోసారి దాస్యంను ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో గ్రేటర్ 31,49 డివిజన్లలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. డివిజన్ కార్పొరేటర్లు మామిండ్ల రాజు, ఏనుగుల మానసారాంప్రసాద్ హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో చీఫ్ విప్ను మర్యాద పూర్వకంగా కలిసి స్వీట్ తినిపించి, పుష్పగుచ్ఛం అందజేశా రు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జానకీ రాములు, కరుణాకర్, బాబురావు పాల్గొన్నారు.