వర్ధన్నపేట : వర్ధన్నపేట పట్టణ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఆకేరువాగు ఒడ్డున గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గురువారం ఆకేరువాగు బ్రిడ్జి పక్కన నుంచి దుర్వాసన వస్తుండటంతో పలువురు పరిశీలించడంతో మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు అందించిన సమాచారంతో సీఐ సదన్కుమార్, ఎస్ఐ రామారావులు వాగు వద్దకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కానీ అప్పటికే మృతదేహం పూర్తిగా కుల్లిపోయి ఉండటంతో అధికారులు శవానికి సంబంధించిన ఆనవాళ్లను రికార్డు చేసుకున్నారు. అలాగే శవాన్ని అక్కడే పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేయించారు. మృతుడి ఆచూకీ కోసం విచారణ ప్రారంభించారు.