మట్టెవాడ : వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ ఇన్ స్పెక్టర్ గణేశ్ తెలిపారు. వరంగల్ టాస్క్పోర్స్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు రామన్నపేటలోని సూరజ్ బార్ అండ్ రెస్టారెంట్పై దాడి చేసి అందులో బెట్టింగ్కు పాల్పడుతున్న గీసుగొండ మండలానికి చెందిన వడ్లూరి కన్నిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ. 6300 నగదుతో పాటు మోబైల్ ఫోన్ను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే గీసుగొండకు చెందిన గట్టికొప్పుల శ్రీరాం పారిపోయినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గణేష్ తెలిపారు.