కరీమాబాద్, ఏప్రిల్ 11: తన భూమిని కొందరు కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపడుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఇక్బాల్ గురువారం రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేశారు. గురువారం వరంగల్ ఫోర్ట్ రోడ్లోని ఈద్గాలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ క్రమంలో చింతల్లోని సర్వే నంబర్ 444లో గల 275 గజాల స్థలం కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని ఇక్బాల్ కోరాడు. విచారణ చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ పోలీసులను ఆదేశించారు.