హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 30: సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తున్నారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెకులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ ఒకవైపు సంక్షేమం మరో వైపు అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. నియోజకవర్గంలో 51 వేల కుటుంబాలు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందారన్నారు. ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. ఎన్నికల్లో కుటుంబ సభ్యుడిగా తనను ప్రజలు ఆదరించాలని వినయ్భాస్కర్ కోరారు. కార్యక్రమంలో 91 మంది లబ్ధిదారులకు రూ.94 లక్షలు విలువ గల చెకులను అందజేశారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధ్యక్షులు
విద్యుత్ సమస్యల్లేని తెలంగాణ
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తున్నట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గ్రేటర్ 31వ డివిజన్ న్యూశాయంపేటలోని రైల్వే గేట్, హంటర్రోడ్డులోని భద్రకాళీ బండ్ ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న విద్యుత్ సబ్స్టేషన్ల పనులకు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్ మామిండ్ల రాజుతో కలిసి శనివారం చీప్ విప్ వినయ్భాస్కర్ శంకుస్ధాపన చేశారు. అంతకు ముందు మచిలీబజార్లో ఏఈ సర్వీస్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ దేశంలోనే 24 గంటల కరంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణదే అని అన్నారు. నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో నిరంతరం విద్యుత్ అందించేలా మంత్రి జగదీశ్వర్ రెడ్డి చర్చించి, రూ.4కోట్లతో రెండు సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సోదా కిరణ్, మాజీ కార్పొరేటర్ మామిం డ్ల శివశంకర్, వద్దిరాజు గణేశ్, విద్యుత్ అధికారులు వెంకటరమణ, మల్లికార్జున్ పాల్గొన్నారు. కాగా, 31వ డివిజన్లోని పద్మాక్షి రోడ్డులోని రూ.3.50కోట్లతో నిర్మిస్తున్న రజక భవన నిర్మాణ పనులను కూడా చీఫ్విప్ పరిశీలించారు. త్వరలో మంత్రి కేటీఆర్తో దాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే, మెలుహా జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో గార్డెన్లో కల్చరల్ పెస్ట్-2023 కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిధిగా చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ పీవీఆర్కే మూర్తి, డైరెక్టర్ సతీశ్, ఏజీఎం శ్రీనివాస్, ప్రిన్సిపాల్ సంధ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.