వరంగల్ చౌరస్తా: పర్యావరణ హితాన్ని కోరి ప్రతి ఒక్కరూ జ్యూట్ బ్యాగులు(jute bags) వినియోగించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద(Satya Sharada) అన్నారు. శుక్రవారం వరంగల్ స్టేషన్ రోడ్డులోని ఎం.కె. నాయుడు హోటల్లో మినిస్ట్రీ ఆఫ్ టెక్ట్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారం తో జ్యూట్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన జ్యూట్ మార్క్ ఇండియా స్కీమ్ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని ఆమె అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణానికి, మానవ మనుగడకు హాని కలిగించని విధంగా ప్రమాణాలకులోబడి తయారు చేయబడిన జనపనార వస్తువులకు జ్యూట్ మార్క్ ఇండియా ముద్రించబడి ఉంటుందన్నారు. అనంతరం జ్యూట్తో తయారు చేసిన వస్తువులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ని సందర్శించారు.