న్యూశాయంపేట, జనవరి 29 : దళిత బంధు దేశానికే దిక్సూచి అని, దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్యెల్యే అరూరి రమేశ్ అన్నారు. హంటర్రోడ్డులోని ఎమ్మెల్యే అరూరి రమేశ్ క్యాంపు కార్యాలయంలో ఐనవోలు మండలం పెరుమాండ్ల గూడేనికి చెందిన 9 మందికి ఆదివారం ఆయన దళిత బంధు యూనిట్లను పంపిణీ చేసి మాట్లాడారు. సమాజంలో దళితులు ఉన్నతంగా జీవించాలనే లక్ష్యంతో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, డ్రైవర్లను ఓనర్లు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. దళితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్థిరపడాలని, దళితుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని, దళితులు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు. అనంతరం ఆయన స్వయంగా ట్రాక్టర్ను నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీ మార్నేని మధుమతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవి, జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఉస్మాన్అలీ, మండల కోఆప్షన్ మెంబర్ గుంషావలీ, సర్పంచ్ రజిత, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చందర్రావు, పార్టీ మండల అధ్యక్షుడు పోలెపల్లి శంకర్రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి, మిద్దెపాక రవీందర్, ఐనవోలు ఆలయ చైర్మన్ మజ్జిగ జైపాల్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఐలవోలు ఆలయ మాజీ చైర్మన్ మునిగా సంపత్కుమార్ పాల్గొన్నారు.
ఎజీఎఫ్ ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రీమియర్ లీగ్
అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హసన్పర్తి మండలంలోని బావుపేట క్రాస్ సమీపంలో ఫిబ్రవరి 1 నుంచి కేసీఆర్ ప్రిమియర్ లీగ్ క్రీకెట్ పోటీలు నిర్వహించనున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. హంటర్రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో పోటీలకు సంబంధించిన డ్రాలు తీశారు.
రాంపేట గ్రామానికి పెద్దపీట
మడికొండ : విలీన గ్రామాల అభివృద్ధిలో రాంపేటకు పెద్దపీట వేసినట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 45వ డివిజన్ రాంపేట గ్రామంలో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను ఆదివారం ఆయన కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.6 కోట్ల 8 లక్షల 46 వేలతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం మడికొండలో ఇటీవల మృతి చెందిన మూల రామక్క కుటుంబ సభ్యులను పరామర్శించారు. దర్గా సొసైటీ చైర్మన్ ఊకంటి వనంరెడ్డి, మాజీ కార్పొరేటర్ బస్కె శ్రీలేఖ, నాయకులు కంకణాల సంపత్రెడ్డి, బస్కె కృష్ణ, రమేశ్ పాల్గొన్నారు. అలాగే, హసన్పర్తితో పాటు నాగారం, గుండ్ల సింగారం, కొత్తపల్లి గ్రామాల్లో మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు.