హనుమకొండ చౌరస్తా : హనుమకొండ బాలసముద్రంలోని స్విమ్మింగ్పూల్లో 6వ తెలంగాణ అంతర్ జిల్లాల సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ స్విమ్మింగ్, డైవింగ్ చాంపియన్షిప్ పోటీలు కోలాహలంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్విమ్మింగ్ రెండురోజుల పోటీలు సోమవారం ముగిశాయి. ఈ పోటీల్లో 350 మంది క్రీడాకారులు, టెక్నికల్ అఫీషియల్స్, కోచ్లు పాల్గొన్నారు. మొత్తం ఫ్రీ స్టైల్, బెస్ట్స్ట్రోక్ , బ్యాక్స్ట్రోక్, ఐఎం, బట్టర్ఫ్లె ఐదు ఈవెంట్లలో పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు మెడల్స్తో పాటు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ మెంబర్, గిరిజన సంక్షేమ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఫిలిం ప్రొడ్యూసర్ ఎన్ఎస్ నాయక్ పాల్గొని మాట్లాడారు. క్రీడలు మానసికొల్లాసానికి, శారీర దృఢత్వానికి దోహదపడతాయన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు.
అనంతరం స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా ఛైర్మన్ టి.సునీల్రెడ్డి, కార్యదర్శి మంచాల స్వామిచరణ్, జిల్లా అధ్యక్షుడు కె.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రెండురోజుల పాటు నిర్వహించిన స్విమ్మింగ్ అండ్ డైవింగ్ పోటీల్లో క్రీడాకారులు పాల్గొని వారి ప్రతిభ కనబర్చాన్నారు. క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా త్వరలో బెంగుళూరులో జరిగే 37వ సబ్జూనియర్, 47వ జూనియర్స్, 74వ సీనియర్స్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్సింగ్, కోచ్ రాయబారపు నవీన్కుమార్, కార్పొరేటర్ రావుల కోమలకిషన్ తదితరులు పాల్గొన్నారు.