హనుమకొండ చౌరస్తా, మార్చి ;‘పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రాముఖ్యత విజ్ఞానగనిగా పేరుగాంచింది’ అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హనుమకొండ కిషన్పురలోని చైతన్య 11వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వారసత్వ సంపద కాపాడుకోవాల్సి బాధ్యత మన అందరిపై ఉందన్నారు. అమ్మ భాషను మరిచిపోవద్దని, తెలుగు భాషను ఆదరించాలన్నారు. ఇంగ్లిష్ భాష కళ్లద్దాల్లా ఉంటుందని చెప్పారు. మన భాష, యాస, కట్టు, బొట్టు, మన సంస్కృతీ సంప్రదాయాలను మరిచిపోవద్దని సూచించారు. ‘విద్య అనేది మిషన్.. కమీషన్ కాదు.. విద్య వ్యాపారం కాకూడదు.. మంచి భవిష్యత్ పిల్లలకు అందించాలని కాంక్షించారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, నీతికి, సంప్రదాయానికి కట్టుబడి ఉండాలన్నారు. నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు మాట్లాడుతూ విద్య అనేది చాలా ముఖ్యమని, విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఉపకులపతి దామోదర్, రిజిస్ట్రార్ ఎం.రవీందర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ గాదె రాంబాబు, వీరవెంకటయ్య, అడ్మినిస్ట్రేషన్ డీన్ కవిత, అడ్మిషన్స్ డీన్ సుమ, సైన్స్ డీన్ బీఎస్ అనురాధ, ఇంజినీరింగ్ డీన్ శంకర్లింగం, ఱె డీన్ చేరాలు, కామర్స్ కృష్ణమాచారి, బయోటెక్నాలజీ క్రిష్టోఫర్ రూబెన్ పాల్గొన్నారు.