గీసుగొండ, డిసెంబర్ 4: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన ప్రొఫెసర్పై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కనకం సంధ్య డిమాండ్ చేశారు. 15వ డివిజన్ గరీబ్నగర్కాలనీలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రొఫెసర్ విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం అతడికి కఠినంగా శిక్షించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో నాయకులు స్వరూప, కోమాల, రజిత, లక్ష్మి, మహేశ్వరి పాల్గొన్నారు.