నర్సంపేట/ఖానాపురం, జనవరి 1: జిల్లా ప్రజలు నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేక్లు కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి వేడుకలు నిర్వహించారు. మహిళలు ఇంటి ముంగిళ్లలో రంగవల్లులతో ఆకట్టుకున్నారు. యువత హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సందడి చేసింది. నర్సంపేట పట్టణంలో ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆదివారం రోజంతా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య గడిపారు. ఖానాపురం మండలంలోని బుధరావుపేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. నూతన సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలకు శుభాలు కలుగాలని పూజలు చేశారు. అనంతరం నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఆర్బీఎస్ కన్వీనర్ కుంచారపు వెంకట్రెడ్డి, సర్పంచ్ కాస ప్రవీణ్కుమార్, ఉప్పు వెంకటేశ్వర్లు, వెంకన్న, బాలు, మౌలానా, రామసహాయం ఉపేందర్రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ, డైరెక్టర్ సునీత, పూర్ణచందర్రావు తదితరులు పాల్గొన్నారు.
అందమైన ముగ్గులు వేసి..
నర్సంపేటరూరల్/చెన్నారావుపేట/దుగ్గొండి/సంగెం/రాయపర్తి: నర్సంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. 2022 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2023కు స్వాగతం పలికారు. ఇళ్ల ఎదుట మహిళలు, యువతులు న్యూ ఇయర్కు స్వాగతం పలుకుతూ అందమైన, ఆకర్షణీయమైన ముగ్గులు వేశారు. యువజన, మహిళా సంఘాల బాధ్యులు కేక్లు కట్ చేశారు. లక్నేపల్లి బాలాజీ టెక్నో స్కూల్లో బిట్స్ చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్రెడ్డి, ప్రిన్సిపాల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్రెడ్డి కేక్ కట్ చేశారు. చెన్నారావుపేట మండలవ్యాప్తంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు విద్యా సంస్థల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్స్టేషన్లో ఎస్సై మహేందర్, సిద్ధార్థ గురుకులంలో చైర్మన్ కంది గోపాల్రెడ్డి కేక్లు కట్ చేసి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం కరుణాకర్రెడ్డి, ఉపాధ్యాయుడు మేడి రమేశ్ పాల్గొన్నారు.
దుగ్గొండి మండలంలోని ఆలయాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో గ్రామస్తులు పాడిపంటలతో సుఖసంతోషాలతో వర్థిల్లాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. విద్యా సంస్థల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. పోలీస్స్టేషన్లో ఎస్సై నవీన్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అడవిరంగాపురం, మందపల్లి ప్రాతమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు నూతన సంవత్సరానికి స్వాగతం పలికే చిత్రం వేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. సంగెం మండలంలో న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కేక్లు కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహిళలు ఇండ్ల ముంగిట నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రంగురంగుల ముగ్గులు వేశారు. న్యూ ఇయర్ సందర్భంగా రాయపర్తి మండలంలోని వెంకటేశ్వరపల్లి స్వయంవ్యక్త వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు పూజలు చేశారు. మైలారం గ్రామానికి చెందిన మండల కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అశ్రఫ్పాషాతోపాటు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులకు దయన్న యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, సామాజిక సేవా కార్యకర్త బదావత్ వీరూనాయక్ మిఠాయిలు పంపిణీ చేసి శుభకాంక్షలు తెలిపారు.