ఖానాపురం, మే 27 : తీన్మార్ మల్లన్న చిల్లర మాటలు ఎవరూ నమ్మరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పోలింగ్ బూత్లను పరిశీలించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. అమెరికాలో ఉన్నత ఉద్యోగం మానేసి ఇండియాకు వచ్చింది జై తె లంగాణ నినాదం కోసమేనని అన్నారు.
ఆనాడు తనను కాకతీయ యూనివర్సిటీ ముందుండి నడిపించిందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నాయకులతో రాజకీయ పాఠాలు నేర్చుకున్నానని చెప్పారు. తీన్మార్ మల్లన్న చిల్లర మాటలను ఎవరూ నమ్మరన్నారు. ఎన్నికల్లో ఒక స్థిరమైన వ్యక్తిత్వం గెలుస్తుందే తప్ప బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు తావులేదన్నారు. ఇప్పటికైనా తీన్మార్ మల్లన్న తన మాటలు మార్చుకోకపోతే భూస్థాపితం కాక తప్పదని హెచ్చరించారు.