న్యూశాయంపేట, డిసెంబర్ 26: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చకపోగా రాష్ట్రంపై ఇష్టం వచ్చినట్లుగా నిందలను మో పుతున్నదని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ ఏర్పాటును తిరస్కరించినందుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం కాజీపేటలో కేం ద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్విప్ దాస్యం మాట్లాడుతూ దశాబ్దాల నుంచి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కాజీపేట ప్రజల ఆశలను కలగానే మిగిల్చాయన్నారు. 1980లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని మం జూరు చేస్తే మడికొండ-అయోధ్యపురం పరిసర ప్రాంతాల్లో స్థల సేకరణకు ప్రతిపాదనలు చేశారన్నారు.
అప్పుడు పంజాబ్ అల్లర్లను తగ్గించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం డొంగోవాల ఒప్పందం ప్రకా రం కాజీపేటకు మంజూరైన కోచ్ ఫ్యాక్టరీని పం జాబ్కు తరలించిందని ఆయన పేర్కొన్నారు. అప్పటి నుంచి స్థానికంగా అనేక ఉద్యమాలు జరిగాయని, కోచ్ ఫ్యాక్టరీ సాధన పోరాట సమితి పేరుతో దశాబ్ద కాలంగా అనేక పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు కోచ్ ఫ్యాక్టరీని మరిపించడానికి పీవోహెచ్ వ్యాగన్ పరిశ్రమ పేర్లతో చిన్న పరిశ్రమలు మంజూరు చేశారని, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తేనే షెడ్లను ఏర్పాటు చేస్తామని నిబంధన పెట్టారన్నారు. 160 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇచ్చినా రైల్వే శాఖ సాకులు చెబుతూ వాయిదా వేస్తూ వస్తున్నదని చీఫ్విప్ వివరించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణకు ప్రయోజనం చేకూర్చే ఒక్కటంటే ఒక్క విభజన హామీనీ కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చకపోగా, ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం అవగాహన రాహిత్యంతో రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఇవన్నీ ఆ పార్టీ దిగజారుడు తనానికి అద్దం పడుతున్నాయ న్నారు. ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం లో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో కేంద్రమంత్రి తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని లిఖిత పూర్వక సమాధానం ఇస్తే.. స్థానిక బీజేపీ నాయ కులేమో రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడం లేదని ప్రచారం చేయడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ప్రత్యేక రాష్ర్టానికి నో అని చెప్పి న వాళ్లతోనే జై తెలంగాణ అనిపించిన ఇక్కడి ప్రజలు విభజన హక్కులను సాధించుకునేందుకు, కోచ్ పరిశ్రమ విషయంలో కేంద్రంపై దశల వారీగా పోరాటం ఉధృతం చేస్తారని వినయ్భాస్కర్ హెచ్చ రించారు. బీజేపీ డీఎన్ఏలోనే తెలంగాణపై వివక్ష ఉందని చీప్ విప్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం మేము సైతం అంటూ పలువురు యువకులు బీఆర్ఎస్లో చేరగా, వారిని స్వాగతించారు.