సంగెం : సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో జరుగుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను పరిశీలించారు. చింతలపల్లి ఉపకేంద్రాన్ని సందర్శించి జాతీయ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రపంచ హార్ట్డేను పురస్కరించుకుని ఆయన ఉద్యోగులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండేందుకు రాపిడ్ రెస్పాండ్ టీం (ఆర్ఆర్)ను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
మండలంలో కరోనా టీకాలు వందశాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ గోపాల్రావు, ఎంపీపీ కళావతి, ఆర్బీఎస్కె డాక్టర్ రజిత, హెచ్ఈఓలు సత్యరాజ్, సమాల్, పీహెచ్ఎన్ శాంతమ్మ, స్టాప్ నర్సు అనూష, హెల్త్ అసిస్టెంట్లు రంజిత్, శ్రీనివాస్, మెర్సమ్మ, కవిత, ఆశవర్కర్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.