మడికొండ, ఫిబ్రవరి 24 : మడికొండ మెట్టుగుట్టపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీస్వయంభూ లింగేశ్వరస్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ముఖ్యఅతిథిగా హాజరై రథాంగ పూజ నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మెట్టుగుట్ట నుంచి మడికొండ గ్రామ వీధుల గుండా స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకగా మహిళల కోలాటాలు, పోతరాజుల విన్యాసాలు, తీర్కొ వేషధారణలు, గొల్ల డప్పు వాయిద్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఈవో శేషుభారతి, చైర్మన్ దువ్వ నవీన్, అర్చకులు రాగిచేడు అభిలాష్శర్మ, పరాశరం విష్ణువర్ధనాచార్యులు, పారుపల్లి సత్యనారాయణశర్మ, దేవేందర్శర్మ, సాయిశర్మ, కార్పొరేటర్ మునిగాల సరోజన కరుణాకర్, మాజీ చైర్మన్ అల్లం శ్రీనివాసరావు, ధర్మకర్తలు నార్లగిరి కుమారస్వామి, చింతకుంట్ల భూపాల్రెడ్డి, బుర్ర సంధ్యారాణి, ఓర్సు రాజు, పెద్ది ప్రభాకర్, దేవుడు రాజు, బీఆర్ఎస్ నాయకులు బొల్లికొండ వినోద్, నర్మెటి భిక్షపతి, సిబ్బంది పాల్గొన్నారు.