గణపురం, ఏప్రిల్ 1: అంబర్ ప్యాకెట్ ఇవ్వలేదని కిరాణా వ్యాపారిపై కత్తితో దాడి చేసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై మచ్చ సాంబమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బంగ్లాపల్లి గ్రామంలో నగావత్ రాజు కిరాణా షాపు నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన గుగులోత్ దేవేందర్ ఆదివారం అర్ధరాత్రి సమయంలో వారిని లేపి అంబర్ ప్యాకెట్ ఇవ్వాలని అడిగాడు. రాజు లేదని చెప్పడంతో కోపంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో తేరుకున్న కుటుంబ సభ్యులు అరవగా దేవేందర్ అకడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో రాజు మెడకు తీవ్ర గాయం కావడంతో వెంటనే 108 వాహనంలో వరంగల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తలించారు. కాగా రాజు పరిస్థితి విష మంగా ఉన్నట్లు సమాచారం. బాధితుడి తల్లి ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసి దేవేందర్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.