వరంగల్,ఆగస్టు 16 : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉనికిచర్లలో 135 ఎకరాల్లో చేస్తున్న లే అవుట్లో ప్లాట్ల వేలానికి సర్వం సిద్ధ్దమైనట్లు కుడా వైస్ చైర్మన్, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. బుధవారం ఆయన ఉనికి చర్లలోని యూనిసిటీలో ప్లాట్ల వేలానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన ఉనికిచర్లలో 135 ఎకరాల్లో చేస్తున్న లే అవుట్లో ప్లాట్ల వేలం నిర్వహిస్తామన్నా రు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యూనిసిటీ అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. వంద శాతం వాస్తు లో యూనిసిటీలో ప్లాట్లను చేస్తున్నామన్నారు.
అండర్గ్రౌండ్ డ్రైనేజీ, కేబుల్ వ్య వస్థ, తాగునీటి వసతి, విశాలమైన రోడ్లు, అవెన్యూ ప్లాంటేషన్, చిల్ట్రన్ పార్క్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నేషనల్ హైవే ఔటర్ రింగ్రోడ్డుకు అతి సమీపంలో యూనిసిటీని ఏర్పాటు చే స్తున్నామని ఆయన తెలిపారు. మొదటి విడుతలో 200, 300 గజాల ప్లాట్లు 50 వేలం నిర్వహిస్తామన్నారు. 20 తేదీ ఉదయం 11 గంటలకు ప్లాట్ల వేలం ప్రారంభిస్తామని తెలిపారు. ఆసక్తి గల వా రు రూ. 25 వేల ఈఎండీ చెల్లించాలని తెలిపారు. వేలంలో ప్లాటు రానిచో డిపాజిట్ సొమ్ము తిరిగి ఇచ్చేస్తామన్నారు. కుడా పీవో అజిత్రెడ్డి, ఈఈ భీమ్రావు, ఏఈ సిద్దార్థనాయక్ పాల్గొన్నారు.