డెంగీ, మలేరియాపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ ఏడాది వరుస వర్షాలతో కేసులు పెరుగుతుండడంతో జ్వరాల నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఇందుకోసం జిల్లాలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ), అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(యూపీహెచ్సీ) పరిధిలో వారంలో మూడు రోజుల పాటు పనిచేసేలా కార్యాచరణ రూపొందించారు. ఈ బృందాలు పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తిస్తాయి. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాయి.
– వరంగల్, అక్టోబర్ 7(నమస్తేతెలంగాణ)
వరంగల్, అక్టోబర్ 7(నమస్తేతెలంగాణ): ఈ ఏడా ది విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో మునుపెన్న డూ లేని రీతిలో జిల్లాలో డెంగీ, మలేరియా కేసులు న మోదవుతున్నాయి. గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 105 డెంగీ, 36 మలేరియా కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఒక్క సె ప్టెంబర్ నెలలోనే 40 డెంగీ కేసులు నమోదైనట్లు గు ర్తించారు. గత జూలైలో 13, ఆగస్టులో 24, సెప్టెంబ ర్లో 40కి పెరగడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ము ఖ్యంగా వరంగల్ నగరంలో ఎస్ఆర్ఆర్తోట, కాశీ బుగ్గ, దేశాయిపేటతో పాటు ఎంజీఎం ఆస్పత్రి పరిస రాలు, గీసుగొండ, ఖానాపురం, పర్వతగిరి, నెక్కొండ, నర్సంపేట మండలం బానోజీపేట పీహెచ్సీల పరిధిలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు గుర్తిం చా రు. ఎస్ఆర్ఆర్తోటతో పాటు ఖానాపురం మండలం లో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దీంతో జిల్లాలో డెంగీ, మలేరియా కేసుల నియంత్రణ కు చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మూడు రోజుల క్రితం జిల్లా వైద్య ఆరో గ్య శాఖ అధికారి వెం కటరమణ, ప్రోగ్రాం అధికారి చల్లా మధుసూదన్ జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలోని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, పీహెచ్సీలు, యూ పీహెచ్సీ ల మెడికల్ ఆఫీసర్లతో మాట్లాడారు. డెంగీ, మలేరియా నివారణ కోసం తక్షణమై చేపట్టాల్సిన చర్యలపై సూచ నలు చేశారు. ఈ కేసులు నమోదైన చోట వెంటనే ఆరో గ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే చేయాలని చెప్పారు. పాజిటివ్ వచ్చిన ఏరి యాలో యాంటీ లార్వల్ డిస్ ఇన్ఫెక్షన్, మలేరియా స్ప్రే ద్వారా దోమలను అరికట్టాలని సూచించారు.
నియంత్రణకు ప్రత్యేక బృందాలు
జిల్లాలోని ప్రతి పీహెచ్సీ, యూపీహెచ్సీ పరిధిలో డెంగీ, మలేరియా నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. ఆయా పీహెచ్సీ, యూపీహెచ్సీ మెడిక ల్ ఆఫీసర్ ఆధ్వ ర్యంలో పనిచేసే ఈ బృందాల్లో సూప ర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఇతర వైద్య సిబ్బందితో పాటు ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, పర్యవేక్ష కులు ఉంటారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్, జీడ బ్ల్యూఎంసీ సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక బృందా లు జిల్లాలో డెంగీ, మలేరియా నియంత్రణకు పనిచేసే విధంగా ప్రణాళిక తయారు చేశారు. వారంలో ప్రతి శుక్రవారంతో పాటు మరో రెండు రోజులు అంటే మూ డు రోజులు డెంగీ, మలేరియా నియంత్రణ కోసం ప్ర త్యేక బృందాలు విధులు నిర్వర్తిస్తాయి. ఈ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తాయి. మురుగు కుంటల్లో నీరు నిల్వ లేకుండా చేయడంతో పాటు వారానికి ఒక రోజు నీటిని మార్చుకోవాలని, పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకోవాలని విస్తృత ప్రచారం నిర్వహిస్తాయి. పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో వైద్య, ఆరోగ్యశాఖ నుంచి ఒక ప్రత్యేక బృందం పనిచేయనుంది. డీఎం హెచ్వో వెంకటరమణ నేతృత్వంలోని ఈ టీంలో ప్రోగ్రాం అధికారి చల్లా మధుసూదన్తో పాటు ఇద్దరు డిప్యూటీ డీఎంహెచ్వోలు, ముగ్గురు సబ్ యూనిట్ ఆఫీసర్లు ఉంటారు.
దోమల ఉధృతి పెరుగుతోంది
– చల్లా మధుసూదన్, ప్రోగ్రాం అధికారి
సీజన్ అనుకూలంగా ఉండడంతో దోమల ఉధృతి పెరుగుతోంది. ఈ ఏడాది వారం పదిరో జులకోసారి వర్షం పడుతుండడంతో నీరు నిల్వ ఉంటోంది. దీంతో దోమలు వ్యాప్తి చెందడానికి అవకాశం కలుగుతోంది. ఫలితంగా డెంగీ, మలే రియా కేసులు పెరిగాయి. నియంత్రణ కోసం చ ర్యలు చేపట్టాం. లార్వాలు పెరగకుండా మందు లు పిచికారీ చేస్తున్నాం. పంచాయతీ, మున్సిప ల్, జీడబ్ల్యూఎంసీ సిబ్బందితో కలిసి ఫాగింగ్ కూడా చేస్తాం. నేడో రేపో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగుతాయి. ఎక్కువగా నమోదవుతు న్న ప్రాంతాలపై దృష్టి పెడుతున్నాం.