ములుగు,డిసెంబర్15(నమస్తేతెలంగాణ): వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాల కు నూతన అడిషనల్ కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికు మారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారులను హనుమకొండ, ములుగు, జనగామ, మహబూబాబాద్ జిల్లాలకు, 2020 బ్యాచ్కు చెంది న ఐఏఎస్ అధికారిని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు నియమించారు. హనుమకొండ అడిషనల్ కలెక్టర్గా రాధిక గుప్తా, ములుగుకు శ్రీజ, జనగామకు పర్మార్ పింకేశ్కుమార్ లలిత్కుమార్, మహబూబాబాద్కు లెనిన్ వత్సల్ తొప్పొ, జయ శంకర్ భూపాలపల్లికి పి. కదిరావన్లకు పో స్టింగ్లు ఇచ్చారు. వీరం తా త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.