దుగ్గొండి, నవంబర్ 22 : గౌడ కులస్తుల ఆరాధ్య దైవాల విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని గౌడ జనహక్కుల పోరాట సమితి మోకు దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల రమేశ్ డిమాండ్ చేశారు. మండలంలోని మందపల్లిలో గౌడ గీత కార్మిక సొసైటీ ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా సర్వే నంబర్ 259లోని 4 ఎకరాల భూమిలో కంఠమహేశ్వరుడు, రేణుకా ఎల్లమ్మ, వనమైసమ్మ విగ్రహాలను సోమవారం రాత్రి గుర్తుతెలియని ధ్వంసం చేసినట్లు తెలిపారు. పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. కూల్చిన విగ్రహాలను పునఃప్రతిష్ఠించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు గడ్డమీది వెంకటయ్య, గౌడ జనహక్కుల పోరాట సమితి మోకు దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల రమేశ్, జిల్లా అధ్యక్షుడు గంప రాజేశ్వర్, జిల్లా వర్కింగ్ప్రెసిడెంట్ మద్దెల సాంబయ్య, నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జి కందుల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సంతోశ్, రంగు చిన్న వెంకటేశ్వర్లు, మధుకర్, నర్సయ్య, రాజీవ్, రవీందర్, సాగపూరి సాంబయ్య పాల్గొన్నారు.