హనుమకొండ చౌరస్తా : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం వెంటనే రాజకీయాల కతీతంగా అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్దత కమిటీ ( Statutory Committee ) ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక రాష్ట్ర చైర్మన్ గోదుమల కుమారస్వామి డిమాండ్ చేశారు. హనుమకొండ ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తన మ్యానిఫెస్టోలో ఉద్యమకారులను గుర్తిస్తామని ప్రకటించిందని తెలిపారు. ఈ డిమాండ్ సాధన కోసం ఈనెల 29న హనుమకొండలోని ఏకాశీలపార్క్ వద్ద తలపెట్టిన మహాదీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీనియర్ సామాజిక ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ వెంకటనారాయణ మాట్లాడుతూ ఉద్యమకారులను గుర్తించేందుకు కాలయాపన చేయడం ఉద్యమకారులలో నిరాశ ఏర్పడుతుందని పేర్కొన్నారు.
సమావేశంలో సీనియర్ ఉద్యమకారులు సోమా రామూర్తి , మంద వీరస్వామి , నాయకులు అంకుశవాలి, ఎండి.యాసిన్, నవరత్న ఆనంద్, గడ్డం శరత్, దారా సూరి, గౌస్, బాబు, స్వర్ణలత, నయీమొద్దీన్, దస్తగిరి, కాజిపేట ఉద్యమకారులు కృష్ణమూర్తి, జక్కుల స్వామి, యాదవ్, గోపనబోయిన రాజు, వరంగల్ ఉద్యమకారులు మోహనచారీ, బిక్షపతి, ఆర్టీసీ ఉద్యమకారులు దొమ్మటి రవీందర్, మహిళా నాయకురాలు దేవి, ఆటో యూనియన్ నాయకులు ప్రకాష్ పాల్గొన్నారు.