రాయపర్తి, జనవరి 30: మండలంలోని ‘మన ఊరు-మన బడి’ మొదటి విడుతలో 21 స్కూళ్లు ఎంపికయ్యాయి. ఇందులో 9 జడ్పీ పాఠశాలలు( కొత్తూరు, రాయపర్తి కాట్రపల్లి, కొండూరు, మైలారం, కొండాపురం, ఊకల్, కొలన్పల్లి, తిర్మలాయపల్లి), 1 ఎంపీ పీహెచ్ఎస్ గన్నారం, 11ఎంపీపీఎస్లు (కొండూరు, కొత్తూరు,రాయపర్తి, సన్నూరు, తిర్మలాయపల్లి, ఊకల్, కొలన్పల్లి, మైలారం, కాట్రపల్లి, పెరికేడు, కొండాపురం) ఉన్నా యి. ఈ పాఠశాలల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశాల మేరకు మండల ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ, అధికారులు, పాఠశాలల యాజమాన్య కమిటీలు, హెచ్ఎంలు, గ్రా మాల సర్పంచ్ల సారథ్యంలో చేపట్టిన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
పాఠశాలలకు కొత్త రూపు
– శేషమ్మ, హెచ్ఎం, కొత్తూరు, ఎంపీపీఎస్
మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాల లు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. గతంలో ప్రభుత్వ బడులన్నీ పాడుబడిన భవనాల్లో ఉండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పంపేందుకు వెనుకాడేవారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆలోచనల ఫలితంగా సర్కారు బడులకు మంచి రోజులు వస్తున్నాయి.
రాజీ లేకుండా పనులు చేశాం
– మాలోత్ వసుందర్నాయక్, ఎస్ఎంసీ చైర్మన్, కొత్తూరు
పేద పిల్లలు చదువుకునే బడులు మంచిగుండాలన్న సీఎం కేసీఆర్ సారు ఆలోచనలతో మేము కూడా పనుల నిర్వా హణలో ఎటువంటి రాజీ పడలేదు. పూర్తి స్థాయిలో నాణ్యాతా ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేశాం. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సహకారంతో పాఠశాల అభివృద్ధికి అదనంగా నిధులు కూడా మంజూరు చేయించుకున్నాం.