ధరణి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

నల్లబెల్లి, నవంబర్26: ధరణి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఆర్డీవో పవన్కుమా ర్ అన్నారు. గురువారం మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న ధరణి సేవలను ఆర్డీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా తీసుకొచ్చిన ధరణి వెబ్సైట్తో అరగంటలో భూమి రిజిస్ట్రేషన్ అవుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా మేడపల్లి, కన్నారావుపేట పరిధిలో దేవాదుల ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన కెనాల్ నిర్వాసితులకు నష్టపరిహారం అందించడంలో జాప్యమైన కొందరు రైతుల భూముల వివరాలను ఆర్డీవో పరిశీలించారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ను పరిశీలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ గుండు వివేక్, కార్యాలయ సిబ్బంది తదితరులున్నారు.
తాజావార్తలు
- కమలా హ్యారిస్ పర్పుల్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారో తెలుసా ?
- చంపేస్తామంటూ హీరోయిన్కు బెదిరింపు కాల్స్..!
- అమెరికా అధ్యక్షుడు ఫాలో అవుతున్న ఆ ఏకైక సెలబ్రిటీ ఎవరో తెలుసా?
- బైడెన్కు ఆ "బిస్కెట్" ఇవ్వకుండానే వెళ్లిపోయిన ట్రంప్
- ఆర్మీ నకిలీ ఐడీకార్డులు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
- ఎస్బీఐ పీఓ మెయిన్ అడ్మిట్ కార్డుల విడుదల
- కరోనా టీకా తీసుకున్న ఆశా వర్కర్కు అస్వస్థత
- క్లినిక్ బయట ఫొటోలకు పోజులిచ్చిన కోహ్లి, అనుష్క
- మీర్జాపూర్ టీంకు నోటీసులు.. అమెజాన్ ప్రైమ్కు మరిన్ని కష్టాలు..!
- కోబ్రా ఫోర్స్లోకి మహిళల్ని తీసుకుంటున్నాం..