రాయపర్తి(వర్ధన్నపేట), ఆగస్టు 27: జిల్లాలో పల్లెప్రగతి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ ముండ్రాతి హరిత అధికారులను ఆదేశించారు. శువ్రారం ఆమె వర్ధన్నపేట మండలంలో ఉప్పరపల్లిని డీఈవో వాసంతి, డీఆర్డీవో మిట్టపల్లి సంపత్రావుతో కలిసి సందర్శించారు. గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న బృహత్ పల్లెప్రకృతి వనాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. వర్ధన్నపేట మండలంలో పల్లెప్రగతి పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పల్లెప్రగతికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. పార్కుల నిర్మాణాల వల్ల గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతున్నదన్నారు. పల్లెప్రగతి పనుల నిర్మాణాల్లో అలసత్వం, నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించే అధికారులు, ప్రజాప్రతినిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆమె హెచ్చరించారు. అనంతరం అధికారుల బృందంతో కలిసి కలెక్టర్ మెగా పార్కులో మొక్కలు నాటి నీళ్లు పట్టారు.
విద్యాలయాలను ముస్తాబు చేయాలి
కరోనా వ్యాప్తి తగ్గినందున రాష్ట్ర ప్రభుత్వం విద్యాలయాలను పునఃప్రారంభించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సెప్టెంబర్ 1 నాటికి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రారంభించేందుకు యాజమాన్యాలు తగిన ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉప్పరపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆమె సందర్శించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జి తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో తక్కళ్లపల్లి రాజ్యలక్ష్మి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మెగా పార్కు పనుల పరిశీలన
మండలకేంద్రం శివారులోని రాయపర్తి-తిర్మలాయపల్లి రహదారిలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లెప్రకృతి వనం నిర్మాణ పనులను డీఆర్డీవో మిట్టపల్లి సంపత్రావు తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సంపత్రావు మాట్లాడుతూ మెగాపార్కుల నిర్మాణంలో 20 రకాల మొక్కలను తప్పనిసరిగా నాటించాలన్నారు. పార్కుల ఏర్పాటులో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో గిర్ధావర్ భాస్కరుల రాజు, ఈజీఎస్ ఏపీవో దొణికెల కుమార్గౌడ్, కార్యదర్శి గుగులోత్ అశోక్నాయక్, వీఆర్ఏలు నాగుల రామ్మూర్తి, ముద్రబోయిన కుమారస్వామి, బైరి వరుణ్కుమార్ పాల్గొన్నారు.