కమలాపూర్, ఆగస్టు 8 : రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. ఆదివారం మండలంలోని గూనిపర్తి, ఉప్పల్ గ్రామాల్లో దళితుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ దళితబంధు పథకంతో ఓట్లన్ని టీఆర్ఎస్ పార్టీకే పడుతాయని భయపడి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేత ఈటల రాజేందర్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రహస్య మంతనాలు చేస్తున్నారన్నారు. దళితుల ఓట్లు చీల్చాలని కాంగ్రెస్, అభ్యర్థులుగా ఎస్సీలను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా దళితులు ఒక్కతాటిపై నిలిచి, కేసీఆర్కు అండగా ఉండాలని కోరారు. ఏనాడూ దళితుల గురించి ఆలోచించని రాజకీయ పార్టీలు ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పెట్టగానే పరేషాన్ అవుతున్నాయన్నారు. గ్రామాల్లో దళితుల వాడకట్టు ఒక్కటై, కేసీఆర్ వైపే ఉంటామని కాలనీల్లో బోర్డులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఓట్ల కోసం వచ్చే బీజేపీ నాయకులను నిలదీయాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దమ్ముంటే దళితబంధు పథకం కోసం కేంద్రం నుంచి రూ.50వేల కోట్లు తీసుకురావాలన్నారు.
ఏడేండ్లలో తెలంగాణ ప్రభుత్వం దళితులకు రూ.55,438కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. దళిత విద్యార్థుల చదువుకోసం రూ.1,447కోట్లు వెచ్చించిందన్నారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగినప్పుడే కేసీఆర్ కల నెరవేరుతుందన్నారు. ప్రజల సానుభూతి పొందేందుకు బీజేపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కాగా, అంబాలలో గౌడ కులస్తులు టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్, మండల ఇన్చార్జి డాక్టర్ పేర్యాల రవీందర్రావు, సింగిల్ విండో చైర్మన్ సంపత్రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ దేవేందర్రావు, ఎంపీటీసీలు సంపత్రావు, అరుణ, పీఏసీఎస్ డైరెక్టర్ హెడ్వర్డ్, కోఆప్షన్ చోటేమియా, నాయకులు స్వర్గం రవి, తిరుపతిరావు, నవీన్కుమార్ పాల్గొన్నారు.
నేడు బల్దియాలో గ్రీవెన్స్
వరంగల్, ఆగస్టు 8 : గ్రేటర్ కార్పొరేషన్లో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు అదనపు కమిషనర్ నాగేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ గ్రీవెన్స్లో పాల్గొనాలని కోరారు.
చైల్డ్లైన్ హెల్ప్ డెస్క్ ద్వితీయ వార్షికోత్సవం
చైల్డ్లైన్-1098 సహకారంతో తరుణి సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్లైన్ హెల్ప్ డెస్క్ ద్వితీయ వార్షికోత్సవ సభను ఆదివారం వరంగల్ రైల్వేస్టేషన్ వీఐపీ లాంజ్లో నిర్వహించారు. కార్యక్రమంలో రూరల్ జిల్లా సీడబ్ల్యూసీ చైర్పర్సన్ వసుధ, సీడబ్ల్యూసీ సభ్యులు రాజేంద్రప్రసాద్, దామోదర్, మధు, ఆర్పీఎఫ్ ఎస్సై ప్రజ్ఞ, జీఆర్పీ ఎస్సై పరశురాములు, డెస్క్ కోఆర్డినేటర్ రాజు పాల్గొన్నారు.
మున్నూరుకాపు భవన నిర్మాణానికి వద్దిరాజు రవిచంద్ర రూ.కోటి విరాళం
మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర రూ.కోటి విరాళం ప్రకటించారు. తెలంగాణ సర్కారు కోకాపేటలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో నిర్మించే భవనానికి విరాళం అందజేయనున్నట్లు హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో జరిగిన కాపు సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన ప్రకటించారు. కాగా, భారీ విరాళం ప్రకటించిన వద్దిరాజు రవిచంద్రను టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నాయకులు కే కేశవరావు, మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు.