వరంగల్, సెప్టెంబర్ 20(నమస్తేతెలంగాణ) : కరో నా కట్టడికి ప్రభుత్వం తొలినుంచి పకడ్బందీ ప్రణాళిక తో అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో విడుతల వా రీగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నది. హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏళ్ల వయసు పైబడిన, 45 ఏళ్ల వయసు పైబడిన వారికి టీకాలు వేస్తున్నది. తాజా గా వంద శాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. వ్యాక్సిన్ సరఫరా పెరుగడంతో 18 ఏళ్ల వయసుపైబడిన ప్రతి ఒకరికి కరోనా టీకా ఇవ్వడమే లక్ష్యంగా ఈ నెల 16వ తేదీన స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పదిహేను రోజుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసే దిశలో ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహిస్తున్నది. ఈక్రమంలో కేవలం ఐదురోజుల్లోనే జిల్లాలో 48,569 మందికి వ్యాక్సినేషన్ చేశారు. కరోనా టీకా తొలి డోస్ తీసుకున్న వారు 37,616, రెండో డోస్ తీసుకున్నవా రు 10,953 మంది ఉన్నారు. ఇప్పటికే మూడు గ్రా మాల్లో నూరుశాతం వ్యాక్సినేషన్ జరుగడం విశేషం.
సబ్ సెంటర్ యూనిట్గా..
గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) యూనిట్గా వ్యాక్సినేషన్ జరిగింది. ప్రతి పీహెచ్సీతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లో కూడా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వ్యాక్సిన్ వేశారు. జిల్లాలో 14 పీహెచ్సీలు, ఏడు యూపీహెచ్సీలు, నర్సంపేట, వర్ధన్నపేట సీహెచ్సీలు ఉన్నాయి. వీటితో పాటు వరంగల్ ఎంజీఎం దవాఖానలోని పీపీ యూనిట్, సీకేఎం లో కూడా వైద్య సిబ్బంది కరోనా టీకా ఇస్తున్నారు. స్పె షల్ డ్రైవ్లో భాగంగా పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, సీహెచ్సీలు, ఎంజీవో, సీకేఎంతో పాటు ఆయా పీహెచ్సీ పరిధిలోని సబ్ సెంటర్లు యూనిట్గా కరోనా వ్యా క్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో 112 సబ్ సెంటర్లు పనిచేస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ నెల 16 నుంచి పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, సీహెచ్సీలు, ఎంజీఎం, సీకేఎంలో, సబ్ సెంట ర్ల పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి సెంటర్ పరిధిలో రోజుకు వంద మందికి టీకా వే యాలనే టార్గెట్తో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ముందుకు వెళ్తున్నారు. స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైన తొ లిరోజు 16న జిల్లావ్యాప్తంగా 132 ఆవాసాల్లో కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. ఆరోజున 8,218 మందికి వై ద్య సిబ్బంది టీకా వేశారు. వీరిలో తొలి డోసు తీసుకు న్న వారు 5,902, రెండో డోస్ వేసుకున్న వారు 2,316 మంది ఉన్నారు. మూడోరోజు శనివారం జిల్లా లో రికార్డు స్థాయిలో 10,327 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. నాలుగోరోజు ఆదివారం 121 ఆవాసాల్లో వ్యాక్సినేషన్ జరిగింది. 6,204 మందికి వైద్య సిబ్బంది టీకా వేశారు. వీరిలో తొలిడోస్ వేసుకున్న వారు 5,356, రెండో డోస్ వేసుకున్న వారు 848 మంది ఉన్నారు. ఐదోరోజు మొత్తం 13764 మందికి వ్యాక్సిన్ వేయగా, అందులో మొదటి డోస్ వేసుకున్న వారు 11000 మంది, రెండో డోస్ వేసుకున్న వారు 2764 మంది ఉన్నారు. స్పెషల్ డ్రైవ్లో వ్యాక్సినేషన్ జరిగిన ఆవాసాల సంఖ్య నాలుగు రోజుల్లో 524కు చేరింది.
నూరు శాతం వ్యాక్సినేషన్..
స్పెషల్ డ్రైవ్తో గ్రామాల్లో నూరుశాతం వ్యాక్సినేషన్ పూర్తి కావడం మొదలైంది. గతంలో గీసుగొండ మండలం మరియపురం సర్పంచ్ అల్లం బాలిరెడ్డి చొరవతో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ప్రభుత్వ ప్రశంసలు పొందింది. ప్రస్తుతం స్పెషల్ డ్రైవ్తో నెక్కొండ మండలంలోని వెంకటాపురం, గంగదేవితండా గ్రామాల్లో నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. నేడోరేపో మరికొన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తికానుంది. ఆయా సబ్ సెంటర్ పరిధిలోని ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారు. వీరికి స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు సహకరిస్తున్నారు. కలెక్టర్ గోపి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ప్రకాశ్, ప్రోగ్రాం అధికారి విపిన్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ను పర్యవేక్షిస్తున్నారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ బీ హరిసింగ్ కూడా వ్యాక్సినేషన్ సెంటర్లను సందర్శించి స్పెషల్డ్రైవ్ను పరిశీలించారు. ఒక ఇంట్లోని కుటుంబ సభ్యుల్లో 18 ఏళ్ల వయసుపైబడిన వారందరూ కరోనా టీకా వేసుకుంటే పూర్తి వ్యాక్సినేషన్ గృహంగా పరిగణించి ఆ ఇంటికి స్టిక్కర్ వేయనున్నట్లు డీఎంహెచ్వో వెంకటరమణ వెల్లడించారు. గ్రామంలో 18 ఏళ్ల వయసు పైబడిన వారందరూ కరోనా టీకా వేసుకుంటే వంద శాతం వ్యాక్సినేషన్ గ్రామంగా పరిగణించి బ్యానర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వంద శాతం వ్యాక్సినేషన్ స్టిక్కర్లు, బ్యానర్లను పీహెచ్సీలకు పంపినట్లు డీఎంహెచ్వో తెలిపారు.