హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 17: హన్మకొండ జేఎన్ఎస్లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో అథ్లెటిక్స్ సింథటిక్ ట్రాక్ సిద్ధమైంది. క్రీడల నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ‘ఖేలో ఇండియా’లో భాగం గా ఏడున్నర కోట్ల వ్యయంతో ఈ ట్రాక్ను నిర్మించారు. వరంగల్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, అథ్లెటిక్స్ అసోసియేషన్లు ట్రాక్ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేశారు. ట్రాక్పై ఒకేసారి ఎనిమిది మంది పరిగెత్తేలా నిర్మించారు. ఎనిమిది లైన్లతో కూడిన 400 మీటర్ల ట్రాక్ పనులు పూర్తయ్యాయి. అలాగే 100 మీటర్ల ట్రాక్ కోసం 10 లైన్లు ఏర్పాటు చేశారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లైన్లు మార్కింగ్ చేశారు. ట్రాక్ మధ్యలో 22 క్రీడల నిర్వహణకు అనువుగా ట్రాక్ను రూపొందించారు. 400 మీటర్ల పరిధిలో ట్రాక్ ఏర్పాటు, దానికి అనుగుణంగా మురుగు, నిల్వనీరు నిల్వకుండా ప్రత్యేకంగా డ్రెయిన్ సదుపాయం కల్పించారు. ట్రాక్ పూర్తయినా ఇంకా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. ట్రాక్ మధ్యలో గడ్డి పరిచేందుకు కొలతలు తీసుకోవడంతో పాటు ఫెన్సింగ్ పనులు జరుగుతున్నాయి. వామ్ అప్ కోసం కలెక్టర్ రూ.91లక్షలు మంజూరు చేయగా ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తికాలేదు. మెట్ల వద్ద రంగు వేయాల్సి ఉంది.
వచ్చే నెల 15నుంచి పోటీలు..
కనీవినీ ఎరుగని రీతిలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించేందుకు సింథటిక్ ట్రాక్ రెడీ అయింది. రాష్ట్రంలోనే ప్రథమంగా జాతీయస్థాయి పోటీలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు పోటీ లు నిర్వహించనుండగా సింథటిక్ ట్రాక్పై క్రీడాకారులు పరుగులు పెట్టనున్నారు. రూ.43 లక్షల వ్యయంతో నిర్వహించే ఈ పోటీల్లో దేశం నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ పోటీలకు ఆర్గనైజింగ్ చైర్మన్గా చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ప్రెసిడెంట్గా తరుణ్జోషి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సారంగపాణి ఉన్నా రు. టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్మెడల్ పొంది న విజేత నీరజ్ చోప్రా సైతం జిల్లాలో జరిగే అథ్లెటిక్స్ పోటీలకు వచ్చే అవకాశం ఉన్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి తెలిపారు.