చెన్నారావుపేట, ఆగస్టు 2 : మండల కేంద్రంలోని పీహెచ్సీలో సోమవారం కరో నా టీకా మొదటి డోస్ 106 మందికి, రెం డో డోస్ 84 మందికి మొత్తం 190 మందికి టీకా వేశామని వైద్యాధికారి డాక్టర్ ఉషారాణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇకపై బుధ, ఆదివారాల్లో తప్ప మిగతా రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో సీహెచ్వో వెంకటేశ్వరరావు, స్టాఫ్ నర్సులు స్వరూపారాణి, హేమలత, హెల్త్ అసిస్టెంట్లు కుండె శివాజీ, వెంకట్రెడ్డి, వైద్య సిబ్బంది రమ, కాంతి, రాజకుమారి పాల్గొన్నారు.
నడికూడ : మండలంలోని రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 370 మందికి కరోనా వ్యాక్సిన్ వేశామని వైద్యాధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. వ్యాక్సిన్ కేవలం సోమవారం, మంగళవారం మాత్రమే అం దుబాటులో ఉంటుందన్నారు.
ఆత్మకూరు : మండలంలో మొదటి, రెం డో డోస్ కలిపి మొత్తం 210 మందికి టీకా లు వేసినట్లు వైద్యాధికారి రణధీర్ తెలిపా రు. కరోనా లక్షణాలు ఉంటే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్సు ఈశ్వరి, ఉమ, సిబ్బంది పాండవుల సాంబయ్య పాల్గొన్నారు.
గీసుగొండ : జ్వరం, దగ్గు ఉన్న వారు క రోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి మాధవీలత సూచించారు. మండలంలోని విశ్వనాథపురం, నందనాయక్తండాలోని పోతురాజుపల్లి గ్రామాల్లో కరోనా ర్యా పిడ్ పరీక్షలు చేశారు. అలాగే 151 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్వో మధుసూదన్రెడ్డి, సూపర్వైజర్ కిరణ్కుమార్ పాల్గొన్నారు.
శాయంపేట : మండల కేంద్రంలోని పీహెచ్సీలో కరోనా వ్యాక్సిన్కు జనం పోటెత్తారు. మొదటి డోస్ 164 మందికి, రెండో డోస్ 149 మందికి మొత్తం 313 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి నాగశశికాంత్, హెచ్ఈవో వెంకటేశ్వరవర్మ, హెల్త్ అసిస్టెంట్ చలపతి తెలిపారు.
కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు
మండలంలో కరోనా విజృంభిస్తోంది. సోమవారం పీహెచ్సీలో జరిపిన ర్యాపిడ్ టెస్టుల్లో కొత్తగా 14 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి నాగశశికాంత్ తెలిపారు. ఒక్క శాయంపేటలోనే 8 మందికి కరోనా సోకిందన్నారు.
నెక్కొండ : ఇకపై వారంలో ఐదు రోజు లు మాత్రమే నెక్కొండ పీహెచ్సీలో వ్యాక్సి న్ వేస్తామని వైద్యాధికారి జయకృష్ణరాజన్ తెలిపారు. సోమ, మంగళ, గురు, శుక్ర, శని వారాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగు తుందన్నారు.
దుగ్గొండి : నిబంధనలు పాటిస్తేనే కొవిడ్ మహమ్మారిని అరికట్టవచ్చని కేశవాపురం పీహెచ్సీ వైద్యాధికారి స్వప్న అన్నారు. పీహెచ్సీలో 80 మందికి కరోనా టీకా వేశామన్నారు. దుగ్గొండిలో 190 మందికి టీకా వే శామని వైద్యాధికారి రాజు చెప్పారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది సాంబయ్య, భాస్క ర్, చక్రపాణి, రహమాన్, వెంకటేశ్వర్లు, మా నస, రజిత, చాణక్య, సబిత, రజిత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.