రాయపర్తి, ఫిబ్రవరి 28: ఆలయాల నిర్మాణంతో సమాజంలో శాంతి నెలకొంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం మండలంలోని తిర్మలాయపల్లిలో కొనసాగుతున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాలతోపాటు గణేశ్కుంట తండాలో అభయాంజనేయస్వామి ఆలయ ప్రారంభోత్సవం, స్వామివారి మూలవిరాట్, కనకదుర్గ విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవ పూజల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక ఆలయాలు, మసీదులు, దర్గాలు, ఈద్గాలు, చర్చిలు, ప్రార్థనా స్థలాల సమగ్రాభివృద్ధికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని మతాలకు ప్రాధాన్యం ఇస్తూ ముఖ్య పండుగలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. గణేశ్కుంట తండాలో మంత్రి గిరిజనులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, పూస మధు, ఎండీ.నయీం, ఉస్మాన్, సర్పంచ్లు గజవెల్లి అనంత ప్రసాద్, మునావత్ సుజాతానర్సింహనాయక్, గారె నర్సయ్య, నలమాస సారయ్య, రెంటాల గోవర్ధన్రెడ్డి, కోదాటి దయాకర్రావు, బానోత్ భద్రూనాయక్, దీప్లానాయక్, కందికట్ల స్వామి, చిన్నాల రాజబాబు, గూడెల్లి శ్రీనివాస్, మునావత్ మాంజ్యానాయక్, మందాడి సుదర్శన్రెడ్డి, కాంచనపల్లి వనజారాణి, బాషబోయిన సుధాకర్, తాళ్లపల్లి సంతోష్గౌడ్, పతంగి నర్సయ్య, జాజునాయక్, మాలోతు వసుందర్నాయక్, బాదావత్ వీరూనాయక్ పాల్గొన్నారు. తిర్మలాయపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్ఠాపనోత్సవాల్లో మంగళవారం రాత్రి త్రిదండి రామానుజ చిన జీయర్స్వామి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఉషాదయాకర్రావు దంపతులు పాల్గొన్నారు. వారికి వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాలు, మహిళల కోలాట నృత్యాలు, ఒగ్గు కళాకారుల విన్యాసాలు, మంగళ వాయిద్యాలు, డప్పుచప్పుళ్ల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.