దుగ్గొండి, సెప్టెంబర్ 30 : యాసంగిలో రైతులు వరిసాగు ను గణనీయంగా తగ్గించి ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి చిలువూరు దయాకర్ రైతులకు సూచించారు. గురువారం మం డలంలోని నాచినపల్లి, వెంకటాపురం గ్రామాల్లో ఆరుతడి పంట ల సాగుపై రైతు సదస్సు నిర్వహించారు. రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు పెండ్యాల మమత, ఇంగోళి రా జేశ్వర్రావు, ఏఈవోలు విశ్వశాంతి, రాజేశ్, హన్మం తు, మధు తదితరులు మాట్లాడారు.
పర్వతగిరి : రైతులు ఆరుతడి పంటలు సాగుచేయాలని ఏవో టీవీఆర్ఆర్ ప్రశాంత్ కుమార్ సూచించారు. మండలంలోని ఏనుగల్లు క్లస్టర్ పరిధిలోని రైతువేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త నాగభూషణం మాట్లాడుతూ.. యాసంగిలో వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఏడీఏ రాంచందర్రావు, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్ నర్సింగం, ఎంపీటీసీ కోల మల్లయ్య, సర్పంచ్ మోతీలాల్, ఉపసర్పంచ్ సతీశ్రావు, ఏఈవోలు రవి, రాకేశ్, స్రవంతి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సంగెం : మండలంలోని సంగెం, తీగరాజుపల్లి, కాపులకనపర్తి, గవిచర్ల, పల్లార్గూడ గ్రామాల్లో ప్ర త్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో యాకయ్య మాట్లాడుతూ.. ప్రతి రైతు విధిగా సాగు చేసే పంటల వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు కక్కెర్ల కుమారస్వామి, బీచ్యానాయక్, కర్జుగుత్త రమ, గోపాల్, ఎంపీటీసీ రంగరాజు నర్సింహస్వామి, ఏఈవోలు రాజేందర్, సమత, సంధ్య, సాగర్ పాల్గొన్నారు.
రాయపర్తి : యాసింగిలో వరి పంటకు పత్యామ్నాయంగా నూనె గింజల సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందని మండల వ్యవసాయాధికారి గుమ్మడి వీరభద్రం తెలిపారు. మండలంలోని పెర్కవేడు గ్రా మంలోని రైతు వేదిక భవనంతో పాటు మండలంలోని మైలారం జీపీ కార్యాలయ ఆవరణలో రైతులకు పంటల వైవిధ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు చిన్నాల తారా శ్రీ, లేతాకుల సుమతి, ఉప సర్పంచ్లు మంగిశెట్టి రాజు, బాద సారయ్య, రైతుబంధు సమితి గ్రామ కో ఆర్డినేటర్లు చిన్నాల యాదగిరి, లేతాకుల మాధవరెడ్డి, మండల వ్యవసాయ విస్తరణాధికారులు రాజారపు శిరీష, ఉడుత సాయి ప్రసాద్, కడుదూరి రాజేశ్కుమార్, వేమిరెడ్డి హిమబిందు పాల్గొన్నారు.