రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ తనయుడి పెళ్లికి సీఎం కేసీఆర్ హాజరు
పుష్పగుచ్ఛాలు, మొక్కలు అందించి ఘనంగా స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు
భీమారం: జననేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నగరానికి అతిథిలా వచ్చి నవ దంపతులను ఆశీర్వదించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మాధవి దంపతుల తనయుడు ప్రతీక్.. ఎస్వీఎస్ విద్యా సంస్థల చైర్మన్ ఎర్రబెల్లి తిరుమల్రావు, సువర్ణ దంపతుల తనయ హర్షిణి వివాహం గురువారం సాయంత్రం భీమారంలోని ఎస్వీఎస్ కన్వెన్షన్లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై వధూవరులను దీవించారు. ముందుగా హెలీకాప్టర్లో హైదరాబాద్ నుంచి వరంగల్ చేరుకున్న సీఎం కేసీఆర్కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి వెళ్లిన సీఎం, అక్కడ కాసేపు బస చేసి పెళ్లికి హాజరయ్యారు. సీఎం వెంట రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ఉన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రోడ్డు మార్గంలో సీఎం కరీంనగర్ వెళ్లారు. వివాహ వేడుకకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, మహమూద్ అలీ, జీ జగదీశ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వీ శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్, చీఫ్విప్ వినయ్భాస్కర్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.