నర్సంపేట , మే 21 : తల్లిదండ్రులను కోల్పోయిన బాలలను చేరదీస్తామని వరంగల్ రూరల్ జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ కే వసుధ అన్నారు. శుక్రవారం నర్సంపేటలోని సంజీవని ఆశ్రమం, రాజరాజేశ్వర అనాథశ్రమంలో కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కోసం ఆశ్రమాల్లో క్వారంటైన్ గదుల ను ఏర్పాటు చేయగా, వాటిని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా పిల్లలు 18 ఏండ్ల లోపు ఉండి తల్లిదండ్రులను, సంరక్షకులను కొవిడ్తో కోల్పోతే వెంటనే జిల్లా అధికారులకు, చైల్డ్లైన్ 1098, చైల్డ్హెల్ప్లైన్ సమాచార మం దించి, ఆశ్రయం పొందవచ్చని సూచించారు. ఇందుకు బాలల సంక్షేమ సమితి ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితిలో ఏదైనా ఆదరణ కోల్పోయిన పిల్లలకు సంబంధించిన సమాచారం తెలిస్తే జిల్లాలోని ప్రజలు సమాచారం అందించాల న్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్, హైదరాబాద్ కార్యాలయంలో ప్రత్యేకంగా కరోనా హెల్ప్డెస్క్ ఏర్పా టు చేశారన్నారు. కరోనా కారణంగా పిల్లలను నిరాధరణ చెందితే వెంటనే 040 23733665కి ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫోన్ చేసి రక్షణ పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్వారంటైన్ గదుల్లో పిల్లలకు సకల సౌకర్యాలు కల్పించామన్నారు. కార్యక్రమంలో సభ్యులు ఏ మధు, జిల్లా బాలల సంరక్షణ అధికారి జీ మహేందర్రెడ్డి, ప్రొటెక్షన్ అధికారి రాజు, ఆశ్రమ నిర్వాహకుడు మోహన్రావు తదితరులు ఉన్నారు.