లక్నో : రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 6 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో రాష్ట్రంలోని 75 జిల్లాల్లో ఈ నెల 6 వరకు కర్ఫ్యూ నిబంధనలు అమలులో ఉండనున్నాయి. యూపీలో ఈ నెల 2వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 7 గంటల వరకు ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది.
రేపటి ఉదయంతో కర్ఫ్యూ ముగియనుండటంతో పొడిగిస్తూ ఆ రాష్ట్ర అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవనీత్ సెహ్గల్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు యూపీలో రాత్రి కర్ప్యూ అమలు చేస్తున్నారు. అత్యవసర సర్వీసులకు మినహాయింపు నిచ్చారు.
కొన్ని వారాలుగా యూపీలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 3 లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి.
దేశంలో అత్యధిక జనాభా గలిగిన యూపీలో కరోనా కట్టడి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.