లక్నో : బీజేపీ ఎంపీ కౌశల్ కిషోర్ కోడలు అంకిత ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆత్మహత్యాయత్నం చేశారు.అంకిత తీవ్ర నిర్ణయం తీసుకునేముందు వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె లక్నోలోని సివిల్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అంకిత ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. తన మణికట్టును కోసుకుని బలవ్మరణానికి ప్రయత్నించే ముందు తనువు చాలిస్తున్నానని పేర్కొంటూ ఆమె రెండు వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు.
తన మరణానికి భర్త ఆయుష్, ఎంపీ కౌశల్ కిషోర్, ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న అత్త జై దేవి, ఆయుష్ సోదరుడు కారణమని, ఆయుష్ తనను మోసగించాడని ఈ వీడియోలో ఆమె పేర్కొన్నారు.
అంకిత ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బీజేపీ ఎంపీ ఇంటికి వెళ్లి మణికట్టును కోసుకున్నట్టు సమాచారం. గత ఏడాది ఆయుష్ అంకితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి పెండ్లికి ఆయుష్ తల్లితండ్రులు ఆమోదం తెలపకపోవడంతో లక్నోలోని మందియోన్ మొహల్లా ప్రాంతంలో వీరు అద్దె ఇంటిలో నివసిస్తున్నారు. మరోవైపు మార్చి 3న ఆయుష్పై కాల్పులు జరగడంతో ఆయనకు గాయాలు కాగా ఇది ఆయుష్ తనకు తాను చేయించుకున్న ఘటనగా పోలీసులు దర్యాప్తు అనంతరం వెల్లడించారు. కౌశల్ కిషోర్ మోహన్లాల్గంజ్ లోక్సభ స్ధానం నుంచి పార్లమెంట్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.