జిల్లాలో 6 వేల ఎకరాల్లో సాగుకు సన్నాహాలు
రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు
వర్ధన్నపేట, జూలై 14 : రైతులు దీర్ఘకాలికంగా ప్రయోజ నం పొందే ఆయిల్ పామ్ సాగుకు జిల్లాలో అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఆయిల్ పామ్ సాగుకు వరంగల్ రూరల్ జిల్లా అనుకూలంగా ఉందని ప్రభుత్వం గుర్తించి, రైతులకు సాగు చేసుకునేందుకు అనుమతిని చ్చింది. దీంతో ఉద్యాన వన శాఖ అధికారులు జిల్లాలో రైతులకు అవగాహన కల్పిస్తూ.. రైతుల నుంచి దరఖాస్తుల ను స్వీకరిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 5 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ను సాగు చేసుకునేందుకు రైతులు దరఖాస్తు చేసుకున్నారు. మరో 1000 ఎకరాల వరకు ఆయిల్ పామ్ చేసుకునేందుకు అవకాశం ఉండడంతో రైతుల నుంచి ఏ ఈవోలు దరఖాస్తులను తీసుకుంటున్నారు. అయిల్ పామ్ మొక్కలను ప్రభుత్వమే నర్సరీలో ఏడాది పాటు పెంచి 90 శాతం సబ్సిడీపై రైతులకు అందించేందుకు జిల్లాలోని ఉ ద్యానవనశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.
లోహితలో నర్సరీ ఏర్పాటు..
రైతులకు సబ్సిడీపై మొక్కలను అందించేందుకు జిల్లాలోని సంగెం మండలం లోహితలో ఉద్యాన వన శాఖ అధికారులు నర్సరీని ఏర్పాటు చేశారు. మలేషియా దేశం నుంచి విత్తనాలను తీసుకువచ్చి నెట్షెడ్డులో మొక్కలు కొంత మే రకు పెంచిన తర్వాత ఓపెన్ నర్సరీలో మొక్కలను పెంచే లా ఏర్పాట్లు చేస్తున్నారు. 2022 జూన్లో మొదటి దశ, అక్టోబర్లో రెండవ దశగా రైతులకు అధికారులు మొక్కలు అందిచనున్నారు. రైతులు 9 మీటర్ల దూరంలో త్రిభుజాకార పద్ధతిలో మొక్కలు నాటుకొని మూడేళ్ల పాటు పెంచుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నాల్గో యేట నుంచి మొక్కలు కాపుదశకు చేరుకున్నాక ప్రతి యేటా మంచి దిగుబడి వచ్చి రైతులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం కలుగుతుందని అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
అందనున్న ప్రభుత్వ ప్రోత్సాహకాలు..
ప్రభుత్వం నుంచి రైతులకు పోత్సాహం అందిస్తోంది. మొ క్కలను 90 శాతం సబ్సిడీని ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రూ.111 విలువ గల మొక్కను కేవలం 27 రూ పాలయలకు మాత్రమే రైతుకు అందించి, మిగతా రూ. 84 సబ్సిడీగా ఇవ్వనున్నది. మూడేళ్లపాటు రైతులకు ఆర్థికంగా సహకారం అందించడం కోసం ఏడాదికి ఎకరాకు రూ.30వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని కూడా అందివ్వనున్నది. మొదటి పంటలో ఎకరాకు 3 నుంచి 5 టన్నులు, 7వ సంవత్సరం నుంచి 10 నుంచి 12 టన్నులు, 10వ సంవత్సరం నుంచి 12 నుంచి 15 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆయిల్ పామ్ ఒక్కో టన్నుకు రూ.19,300ల మేరకు ప్రస్తుతం ధర ఉండడంతో ఎకరాకు రూ.లక్ష మేర రైతుకు ఆదాయం వస్తుందని, అధికారులు వివరిస్తున్నారు. వర్ధన్నపేట మం డలంలోని దమ్మన్నపేటలోని ఓ రైతు వ్యవసాయ భూమి లో కొన్ని ఆయిల్పామ్ మొక్కలను కూడా పరిశోధనాత్మకంగా నాటి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
రైతులకు ఎంతో మేలు
అయిల్ పామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు.. ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా రైతులు నష్టపోకుండా ఆయిల్ పామ్ను సాగు చేసుకుంటే శ్రమ, ఖర్చు తగ్గడంతో పా టుగా ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవాలనుకునే రైతులు ఫీల్డ్ ఆఫీసర్లను సంప్రదించండి. వర్ధన్నపేట, పర్కాల, నడికుడ, రాయపర్తి మండలాల రైతులు ఫోన్ నంబర్ 9000350126కు, సంగెం, నర్సంపేట, దుగ్గొండి, గీసుగొండ రైతులు 955314 8839, నల్లబెల్లి, నెక్కొండ, ఖానాపూర్, చెన్నారావుపేట రైతులు 9502264227, పర్వతగిరి, ఆత్మకూరు, దామెర, శాయంపేట మండలాల రైతులు 84640 96510 ఫీల్డ్ ఆఫీసర్ల ఫోన్ నంబర్లకు సంప్రదించండి. – శంకర్, ఉద్యానవనశాఖ జిల్లా అధికారి