సుల్తాన్బజార్, జూలై 9: పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్ అని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ప్రతి ఒక్కరూ తమ జన్మదినాన మూడు మొక్కలను నాటాలనే క్రమంలో ఈ మేరకు శుక్రవారం ఆయన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఛాలెంజ్ గ్రీన్ ఇండియాలో భాగంగా దవాఖాన ఆవరణలో ఆర్ఎంవోలతో కలిసి మొక్కలను నాటా రు. ఈ సందర్భంగా నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా తీసుకోవాలని ఆర్ఎంవోలకు సూచించారు. వైద్యులు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది, నర్సు లు, వైద్య సిబ్బంది ఆయనకు పుష్ప గుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
జనరల్ సర్జరీ విభాగం వైద్యులు, సూపరింటెండెంట్ పేషీ సిబ్బంది, ఉద్యోగుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కేక్లు కట్ చేయించి తినిపించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు పల్లం ప్రవీణ్, తెలంగాణ వైద్య ఐక్య సంఘాల నాయకులు డాక్టర్ రవి శంకర్ ప్రజాపతి, శిరీష, రేచల్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీఏఎస్ ఆర్ఎంవోలు డాక్టర్లు సాయిశోభ, బండారి శ్రీనివాసులు, అనూరాధ, మహ్మద్ రఫీక్, నరేందర్, సుష్మ, మాధురి, రాజ్ కుమార్, హిమబిందు, ప్రసాద్తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.