సీఎం కోలుకోవడంతో మెట్ల ద్వారా కొండగట్టుపైకి సుంకె రవిశంకర్ పాదయాత్ర
ముడుపు విప్పి పూజలు
మల్యాల, మే 9 : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కరోనా నుంచి కోలుకున్నందున చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొండగట్టు అంజన్న మొక్కు తీర్చుకున్నారు. ఈ మేరకు ఆదివారం మల్యాల, కొడిమ్యాల మండలాల ముఖ్య నాయకులతో కలసి మెట్లదారిన పా దయాత్రగా గుట్టపైన ఆలయం వరకు పాదయాత్రగా చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, గత నెల 20న కట్టిన ముడుపును విప్పారు. తర్వాత ఆంజనేయస్వామి మూలవిరాట్కు ప్రత్యే క పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండగట్టు అంజన్న స్వామి కరుణతో సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకున్నారని తెలిపారు. ఇక్కడ జడ్పీటీసీ సభ్యుడు కొండపలుకుల రాంమోహన్రావు, సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మిట్టపల్లి సుదర్శన్, పునుగోటి కృష్ణారావు, సహకార సంఘం అధ్యక్షులు ము త్యాల రాంలింగారెడ్డి, మేన్నేని రాజనర్సింగరావు, బోయినిపల్లి మధుసూదన్రావు, సర్పంచ్లు రా సమల్ల హరీశ్, గడికొప్పుల రమేశ్, మార్కెట్ కమి టీ చైర్మన్ జనగం శ్రీనివాస్, కొండగట్టు ఆలయ డైరెక్టర్లు ప్రవీణ్, ఆసం శివకుమార్, వొల్లాల లిం గంగౌడ్, సతీశ్, కొంక నర్సయ్య, గొల్లపల్లి శ్రవణ్ కుమార్, ముద్దం రవి, దాసరి రాజేందర్రెడ్డి , నాయకులు మారంపల్లి నారాయణ, త్రినాథ్, గు ర్రం మల్లేశం గౌడ్, సామల్ల ప్రబాకర్, అర్చకులు రామకృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.