అమరావతి : ఏపీలో కొత్త కొవిడ్ వేరియంట్ ఉందంటూ విపక్షం విష ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నదని ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విపక్ష ప్రచారం వల్లే ఒడిశా, ఢిల్లీ ప్రభుత్వాలు ఏపీ ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించాయని ఆయన ఆరోపించారు.
ఎన్440కే వైరస్ కేరళలో చాలాకాలం నుంచి ఉందని పరిశోధకులు తేల్చారని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్440కే వైరస్ లేదని సీసీఎంబీ చెప్పిందని గుర్తుచేశారు.
ఎన్440కే వైరస్ అంత ప్రమాదకరమైంది కాదని పరిశోధనల్లో తేలిందన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. విపత్కరణ పరిస్థితుల్లో విపక్షాలు బురద రాజకీయాలు మాని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.