Naresh Tikait | ముజఫర్నగర్: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చెప్తున్నట్లుగా ఎన్డీఏకు 400కు పైగా స్థానాలు రావడం సందేహాస్పదమేనని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేశ్ టికాయిత్ అభిప్రాయపడ్డారు. 400 స్థానాలు వస్తాయని ముందుగానే జోస్యం చెప్పడం విశేషమని, అలా చెప్తున్నవాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల పట్ల ప్రజల్లో ఉత్సాహం కనిపించడం లేదన్నారు. పశ్చిమ యూపీలో 8 లోక్సభ నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా టికాయత్ మీడియాతో మాట్లాడారు. ప్రజల భ్రమలు తొలగిపోయాయని చెప్పారు.
కొనసాగుతున్న రైతుల నిరసనలు
పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోని శంభు వద్ద రైతుల నిరసనలు మూడో రోజు కూడా కొనసాగాయి. అరెస్టయిన ముగ్గురు రైతులను విడుదల చేయాలనే డిమాండ్తో బుధవారం నుంచి వీరు రైల్వే పట్టాలపై ధర్నా చేస్తున్నారు.