తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ పూర్వ చైర్పర్సన్, ప్రముఖ గాయకుడు, దివంగత సాయిచంద్ భార్య వేద రజని తన భర్త స్థానంలో ఈ పదవిని అందుకున్న తర్వాత తొలిసారి బహిరంగ సభలో పాల్గొని తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. మక్తల్లో ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి హరీష్తో కలసి రజని బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ సర్కారు హయాంలో ఇది లేదు.. ఇది కాదు.. ఇది ఉండదన్నమాటే లేకుండా సంక్షేమ పథకాలను ప్రతి ఊరూ వాడా చేర్చి అన్ని వర్గాల ప్రజలకూ అండగా నిలుస్తోందన్నారు. పాలమూరులో ఒకనాటి పరిస్థితి… నేటి అభివృద్ధి.. వైద్యం – విద్యారంగంలో పురోగతి తదితర అంశాలపై రజిని మాట్లాడిన పలు అంశాలను ఈ వీడియోలో చూడండి.