యాదాద్రి: యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా నిర్మాణం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్లోని నగరి ఎమ్మెల్యే రోజా (MLA Roja) కొనియాడారు. శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ కాలంలో ఎవరికి దక్కని అవకాశం సీఎం కేసీఆర్కు లభించిందన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించే విధంగా ఆలయ నిర్మాణం జరిగిందని తెలిపారు. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాయి గుంటూరు నుంచి తీసుకు వచ్చారని గుర్తుచేశారు. తెలుగువారు ఎప్పటికీ అన్నదముళ్లు, అక్కచెల్లెలుగా కలిసి ఉంటారని రోజా స్పష్టం చేశారు.