కృష్ణా నది ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ గులాబీ దళపతి కేసీఆర్ పోరుబాట పట్టారు. తెలంగాణ ప్రభుత్వం అజ్ఞానం, తొందరపాటు చర్యతో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడం వల్ల మన రాష్ట్రానికి జరిగే నష్టంపై కేసీఆర్ గళమెత్తనున్నారు. ఈ మేరకు నల్లగొండలో జరుగుతున్న చలో నల్లగొండ భారీ బహిరంగ సభకు కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నల్లగొండ బహిరంగ సభ లైవ్ వీడియో ఇక్కడ చూడొచ్చు.