పీతాంబరం పట్టు..ఆ కాలంలో కలవారి ఇండ్లల్లో కనిపించే చీర.. దేవతల అలంకరణలో ముందుండే వస్త్రం. తెలంగాణలోని సిద్దిపేట ఇలాకాలో పుట్టిన పీతాంబరం పట్టుకైతే అప్పుడు ఎనలేని డిమాండ్. కట్టుకున్నవాళ్లు పీతాంబరం పట్టును చూపిస్తూ సంబురపడిపోయేవారు. అది వారికొక స్టేటస్ సింబల్. అయితే, మాంచెస్టర్ మహానగరంలో వెలసిన మరమగ్గాల ధాటికి చేనేత బతుకు చిద్రమైపోయింది. సముద్రాలు దాటొచ్చిన విదేశీ వస్త్రాలకు మన దేశం మార్కెట్ అయిపోయాక సాలెల మగ్గం మూగబోయింది. చేనేత వృత్తే కాదు చేనేత కళాకారుల అద్భుతాలన్నీ అంతరించిపోయినయ్. అందులో ఈ పీతాంబరం పట్టుకూడా ఉంది.. నవాబుల కోసం అల్లిన అందమైన పీతాంబరి బూటా ఓ జ్ఞాపకమైపోయింది. ఆ చరిత్రను వర్తమానం చేసింది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..