లక్నో: అన్నాదమ్ముల మధ్య ఆస్తి వివాదం నేపథ్యంలో ట్రాక్టర్ను నిలువరించేందుకు ఒక మహిళ తన పసి బిడ్డను టైర్ ముందు పడేసింది. ఉత్తర ప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కల్నల్గంజ్ పోలీస్ సర్కిల్ పరిధిలోని లాలే మౌ గ్రామానికి చెందిన అన్నాదమ్ముల మధ్య పొలం పంపకాల విషయంపై వివాదం నెలకొంది. అయితే వారిలో ఒకరు తన ట్రాక్టర్తో పొలాన్ని దున్నేందుకు ఆదివారం ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఆ ట్రాక్టర్ను నిలువరించేందుకు వారిలో ఒకరి భార్య ప్రయత్నించింది. తన చేతుల్లో ఉన్న పాపను ట్రాక్టర్ టైర్ ముందు పడేసింది.
అయితే ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తి వెంటనే బ్రేకులు వేసి నిలిపివేయడంతో ఆ పసి పాపకు ప్రమాదం తప్పింది. అనంతరం ఆ మహిళన పాపను తీసుకుని ఎత్తుకుంది. ట్రాక్టర్పై ఉన్న వ్యక్తితో ఘర్షణకు దిగింది.
కాగా, ఆ సమయంలో అక్కడ ఉన్న ఒకరు మొబైల్లో ఈ వీడియోను రికార్డు చేయడంలో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ మహిళ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియో పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో దీనిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని గోండా ఎస్పీ ఆకాష్ తోమర్ తెలిపారు.
In order to stop her brother-in-law from ploughing the field, a woman threw her toddler in front of the tractor in Lalmau Khalpurva village in UP's Gonda district Fortunately the tractor was stopped on time.@CHILDLINE1098 and @Uppolice should take action here… pic.twitter.com/uH7NHtcKg8
— Kanwardeep singh (@KanwardeepsTOI) August 1, 2022