Viral Video : కరోనా కేసులు పెరుగుతుండడంతో చైనాలో మళ్లీ మాస్క్ తప్పనిసరి అయింది. దాంతో అక్కడి ప్రజలు కొందరు వెరైటీ ఫేస్ మాస్క్లు ఉపయోగిస్తున్నారు. అలాంటిదే పక్షి ముక్కు లాంటి మాస్క్. ఒకాయన ఈ మాస్క్ పెట్టుకొని రెస్టారెంట్లో భోజనం చేస్తున్న వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. పేపర్తో తయారు చేసిన ఈ మాస్క్ అచ్చం పక్షిముక్కను పోలి ఉంది. తినేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు మాస్క్ తీయకుండానే నోరు తెరవడానికి వీలుగా ఉంటుంది. సఫిర్ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. కొందరైతే ఈ మాస్క్ ఎక్కడ దొరుకుతుంది? అని సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో చైనా ఈమధ్యే జీరో కోవిడ్ పాలసీ ఎత్తేసింది. దాంతో భారీగా కేసులు పెరుగుతున్నాయి. ఆ దేశంలో ఒక్కరోజే 3.75 కోట్ల కేసులు నమోదు అయ్యాయి. అమెరికా, బ్రెజిల్, జపాన్ దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మనదేశంలో కూడా కేంద్రం, రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. అంతేకాదు కొత్త కరోనా కేసులను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపాలని తెలిపింది.
Bulls like me feeding on stocks today despite the covid fears after wearing mask. pic.twitter.com/W9LB2QRjSc
— Safir (@safiranand) December 23, 2022