న్యూఢిల్లీ : కుండపోతగా కురుస్తున్న వర్షంలో తడిసి ముద్దవుతూనే వారు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెండ్లి కోసం అద్భుత ఏర్పాట్లు చేసినా ముహుర్తం వేళ భారీ వర్షం కురిసింది. జోరు వానలో తడుస్తూనే వధూవరులు వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేశారు. ఈ పెండ్లి వేడుకకు సంబంధించిన వీడియో (viral video) సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
ఈ వైరల్ క్లిప్ను యాంకర్ జే కర్మాని ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ క్లిప్లో నవ జంట భారీ వర్షం పడుతుండగా పెండ్లి మంటపంపై నడుస్తుండటం కనిపించింది. జోరు వానలోనూ వారి వెనుకనున్న డ్యాన్సర్లు డ్యాన్స్ పెర్ఫామెన్స్ కొనసాగించడం చూడొచ్చు. మీ నిజమైన భాగస్వామిని పెండ్లి చేసుకునేందుకు ఏదీ మిమ్మల్ని ఆపలేదని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి పది లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ క్లిప్ సోషల్ మీడియా యూజర్లను ఆకట్టుకుంది. వాట్ ఏ వెడ్డింగ్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా దేవుడు మిమ్మల్ని పర్సనల్గా బ్లెస్ చేస్తున్నాడని మరో యూజర్ కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read More