మనలో ఎవరైనా సరే గొడుగు ఎందుకు కొంటారు? వర్షంలో తడవకుండా ఉండటానికే కదా. అదే మంచి బ్రాండ్ అయితే భారీ రేట్లు పెట్టడానికి కూడా చాలా మంది వెనుకాడరు. ఇదే అవకాశాన్ని బాగా క్యాష్ చేసుకోవాలని ప్రముఖ బ్రాండ్ కంపెనీలు ఆదిదాస్, గూచి అనుకున్నాయి.
తాజాగా గూచి, ఆదిదాస్ కంపెనీలు ఒక కొత్త గొడుగును విడుదల చేశాయి. దీనిలో వింత ఏంటంటే.. ఆ గొడుగు వర్షంలో వేసుకెళ్లకూడదట. ఎందుకంటే ఇది నీళ్లలో తడిస్తే చెడిపోతుంది మరి. ఈ గొడుగు కేవలం ఎండ నుంచి కాపాడుకోవడానికి, లేదా డెకరేషన్లా వాడుకోవడానికే అని ఆ కంపెనీలు చెప్తున్నాయి.
ఇది చూసి నెటిజన్లు ఈ రెండు కంపెనీల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం వర్షాన్ని ఆపలేని గొడుగు లక్ష రూపాయలా? అని అడుగుతున్నారు. ప్రస్తుతం చైనా మార్కెట్లో అమ్ముడవుతున్న ఈ గొడుగు ధర 11 వేల యువాన్లు (అంటే రూ.లక్షపైగా) అని ఆ కంపెనీలు చెప్తున్నాయి. ఇదంతా చూసిన కొందరు నెటిజన్లు అసలు ఇలాంటి గొడుగు ఎందుకు చేశారని ఆ కంపెనీలను తిట్టిపోస్తున్నారు.