భోపాల్: బీజేపీ పాలిత రాష్ట్రంలో మరో దుస్థితి వెలుగు చూసింది. తరగతి గదుల శ్లాబ్ నుంచి వర్షం నీరు కారడంతో విద్యార్థులు ఏకంగా గొడుగులు పట్టుకుని పాఠాలు విన్నారు. మధ్యప్రదేశ్లోని గిరిజన సియోని జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఘన్సర్లోని ఖైరీ కాలా ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. స్కూల్లోని క్లాస్ రూమ్లు శిథిలావస్థకు చేరినా పాలకులు పట్టించుకోవడం లేదు. అక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తరగతి గదుల శ్లాబ్ల నుంచి వర్షం నీరు ధారగా కారుతుంది. దీంతో చాలా మంది విద్యార్థులు స్కూలుకు రావడం లేదు.
అయితే స్కూలుకు వచ్చిన కొద్ది మంది విద్యార్థులు తమ వెంట గొడుగులు కూడా తెచ్చుకుంటున్నారు. క్లాస్ రూమ్ శ్లాబ్ల నుంచి కారుతున్న వర్షం నీరు తమపై పడకుండా గొడుగులు పట్టుకుని టీచర్ చెప్పే పాఠాలు వింటున్నారు. స్కూల్ దుస్థితి గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ప్రిన్సిపల్ ఆరోపించారు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘నయా భారత్లో నయా అభివృద్ధి’ ఇదేనంటూ ప్రధాని మోదీ, ఎంపీ ప్రభుత్వంపై నెటిజన్లు మండిపడ్డారు. ‘అబద్ధాల మోదీని తొలగించాలి’ అన్న హ్యాష్ట్యాగ్ను కూడా జత చేశారు.
In Seoni district of MP
Under the dilapidated roof of the school dripping in the rain, students forced to study with an umbrella instead of a copy in their handsIs New India New Development?#DeepikaPadukone #SoniaGandhi #मोदी_झूठा_निकला #AryanSinghRathore #TejRan pic.twitter.com/GsLAeJhgrm
— Delhi Ki Awaj (@vansh_h1) July 27, 2022