Viral Video | వన్య ప్రాణులు ఎక్కువగా అడవిలో జీవిస్తుంటాయి. ఆహారం, నీటి కోసం అప్పుడప్పుడు ప్రజల మధ్యలోకి వస్తుంటాయి. తాజాగా సాంబార్ జాతికి చెందిన ఓ దుప్పి ఆహారం వెతుక్కుంటూ సమీపంలోని గ్రామంలోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఫారెస్ట్ ఆఫీసర్ సామ్రాట్ గౌడ్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
వీడియోలో ఏముందంటే.. ఓ పెద్ద దుప్పి విలేజ్లోని టీ స్టాల్ వద్దకు వచ్చింది. అక్కడ నిలబడి అటూ ఇటూ చూసింది. అంతలో అక్కడే ఉన్న ఓ వృద్ధుడు ఆ దుప్పికి ఆహారం అందించాడు. అది ఎంత ఆకలిగా ఉందో ఏమో.. వృద్ధుడు ఇచ్చిన ఆహారాన్ని అమాంతం తినేసింది. మరో వ్యక్తి కప్పులో నీళ్లు పోసి తాపే ప్రయత్నం చేశాడు. మరికొందరు దుప్పితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
If Sambar goes to local hotel what will they offer??
On a serious note wild animals getting used to human habitations is not a good sign… pic.twitter.com/zMJOuWYWIZ— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) November 18, 2022